Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సిగ్గుతో తలదించుకోండి: విశాల్ వర్గంపై రాధిక రెచ్చిపోయి ట్వీట్స్
చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు ముగిసినప్పటికీ తమిళ సినీ తారల మధ్య వివాదం సద్దుమణగలేదు. ఎన్నికల సందర్భంగా నువ్వానేనా అంటూ పోటీ పడుతూ మీడియా ముందుకొచ్చి విమర్శలు గుప్పించుకున్న తారలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చల్లబడడం లేదు.
విశాల్ పక్షం శరత్కుమార్పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేలినట్లు సమాచారం. దీంతో ఆయన సతీమణి, సినీ నటి రాధిక ఆగ్రహంతో ఊగిపోతూ ట్విట్టర్లో విశాల్ వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన శరత్ కుమార్, నడిగర్ సంఘ భవన నిర్మాణ ఒప్పందాన్ని గతంలోనే రద్దు చేసుకున్నామని, అయినా లేనిపోని ఆరోపణలు చేశారని శరత్ బాధపడ్డారు.
ఈ నేపథ్యంలో భవన నిర్మాణంలో వాస్తవాలు తెలుసుకోకుండా విశాల్ చేసిన ఆరోపణలపై రాధికా ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. ఈ ఎన్నికలకు ప్రధాన కారణమైన నడిగర్ సంఘం భవన నిర్మాణంపై ఎస్బీఐ సినిమాస్టర్ తప్పుడు ఒప్పందం కుదుర్చుకుందని తేలింది.
ఈ ఒప్పందం చుట్టే విశాల్ ఆరోపణలు తిరిగాయి. ఎస్బీఐ సినిమాస్టన్తో ఒప్పందాన్ని సెప్టెంబర్ 29వ తేదీనే రద్దు చేసుకున్నట్లు తేలడంతో రాధిక ట్విట్టర్లో విశాల్ వర్గంపై దుమ్మెత్తిపోసారు.
''శరత్ కుమార్పై విమర్శలు గుప్పించిన ఫ్రెండ్సంతా సిగ్గుతో తలదించుకోవాలని, శరత్ను తలచుకుంటే గర్వంగా ఉందని'' ట్వీట్ చేసింది. Hang ur heads in shame for the false accusations friends. proud of you sarath empty victory అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపే అవకాశం ఉందని భావిస్తున్నారు.