Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజీనామా చేసి షాకిచ్చిన రాఘవేంద్ర రావు.. వైఎస్ జగనే కారణమంటూ!
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్గా గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి తాజాగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ ఈవోతో పాటుగా ప్రభుత్వానికి కూడా పంపించారు. వయస్సు పైబడిన కారణం గానే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా రాఘవేంద్ర రావు లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖలో రాఘవేంద్రరావు ఏమన్నారంటే..
సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం
కలియుగ వైకుంఠంలోని వెంకటేశ్వరస్వామికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. నా పదవి కాలంలో తనకు సహకరించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సిబ్బందికి, టీటీడీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాఘవేంద్రరావు తెలిపారు. చాలా కాలంగా వివాదాలతో సతమతమవుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ వారు ఇప్పుడు రాఘవేంద్ర రావు రాజీనామాతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు సాగుతున్నాయి.
టీటీడీ ఛైర్మన్గా రాఘవేంద్రరావు
దర్శకడుు రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్కు ఛైర్మన్ గా ఉన్న నరసింహా రావుపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి.. 2018లో రాఘవేంద్రరావును ఛైర్మన్గా టీటీడీ నియమించింది. అప్పటి నుంచి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ఉన్నట్టుండి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలున్నాయని టాక్ నడుస్తోంది.
బోర్డు సభ్యులు రాజీనామా
విజయకేతనం ఎగరేసిన వైసీపీ పార్టీ.. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు సభ్యులు నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తుండటం గమనార్హం.
వైఎస్ జగన్ విజయమే కారణం
తెలుగు దేశం పార్టీకి అండదండలస్తున్న రాఘవేంద్రరావు కూడా నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా సమర్పించారనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభుత్వాలు మారినప్పడల్లా ఇలాంటి రాజీనామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. ఇక తాజాగా రాఘవేంద్రరావు కూడా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక వైఎస్ జగన్ విజయమే కారణం. అయితే గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి రాజీనామాలను ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.