Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాఘవేంద్రరావు 'ఇంటింటా అన్నమయ్య'మొదలైంది
'శ్రీరామరాజ్యం'నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ లాంచింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఈ యువ హీరో తెరంగ్రేటం చేయనున్నారు. 'ఇంటింటా అన్నమయ్య'టైటిల్ తో రూపొందే ఈ చిత్రంవ విజయదశమి రోజున ప్రారంభం కానుంది. ఇది సాంఘిక కథాంశంతో రూపొందే చిత్రమే. యువతరం ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది అని చెప్తున్నారు.
అయితే ఈ కథా వస్తువులో అన్నమయ్య కీర్తనలు, ఆయన నెలకొల్పిన సంగీత సంప్రదాయాల్ని ఎలా మేళవించారన్నది సస్పెన్స్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తారు. త్వరలో తిరుపతిలో సంగీత చర్చలు మొదలవుతాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. ఒక నాయికగా 'జర్నీ'లో నటించిన అనన్యను ఎంచుకొన్నారు. ఎస్.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తారు.
ఇక నాగార్జునతో ఆయన చేసిన 'శిరిడిసాయి' చిత్రాన్ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు దర్శకులు కె.రాఘవేంద్రరావు వెల్లడించారు. సాయినాథుని భక్తులు ఇష్టంగా కొలిచే గురువారం రోజున 'శిరిడిసాయి' చిత్రాన్ని విడుదల చేయడం విశేషమని తెలిపారు. రాఘవేంద్రరావు బృందంలో సినీ నిర్మాత యలమంచిలి సాయిబాబు ఉన్నారు.