పాండురంగడు పరాజయం అనంతరం రాఘవేంద్రరావు మళ్ళి రంగంలోకి దూకుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ సారి ప్రభాస్ హీరోగా మరో పౌరాణికాన్ని డైరక్ట్ చేస్తారని చెప్తున్నారు. పరుశరాముడు పౌరాణిక గాధ ఆధారంగా ఈ స్క్రిప్టు భారవి వండుతున్నారని సమాచారం. అలాగే సినిమా టైటిల్ కూడా పరుశరాముడు అనే పెట్టబోతున్నారు. అయితే భిళ్ళా రీమేక్ సినిమా అనంతరమే ఈ సినిమా ప్రారంభం కానుంది. పరుశరాముడు క్షత్రియజాతిని సంహరించిన విష్ణుముర్తి అవతారం అని పౌరాణికాలు చెప్తున్నాయి. మరి ఆ తరహా కథకు ఆ కాలంలోకి వెళ్ళి అప్పటి సెట్స్ వేసి రాఘవేంద్రరావు ఎలా తీస్తారన్నిది ఆసక్తికరమే.