twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కల నెరవేరింది.. అప్పుడే ఎంజాయ్ చేస్తాను.. రఘుదీక్షిత్

    By Rajababu
    |

    గాయకులు సంగీత దర్శకులు కావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ గాయకుడు సంగీత దర్శకుడిగా మారిన సినిమాలో అసలు పాటలే లేకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యం తనకూ కలిగిందని చెబుతున్నాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈచిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. కంప్లీట్ థ్రిల్లర్ గా వస్తోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు ఉండవు. కానీ నేపథ్య సంగీతం సగం కథను చెప్పాలి. అలాంటి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటోన్న రఘు ఈ సినిమాతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకున్నాడు.

     ఛాలెంజింగ్ తీసుకొన్నా

    ఛాలెంజింగ్ తీసుకొన్నా

    ‘‘సింగర్ గా తెలుగులో దేవీ శ్రీ ప్రసాద్‌, తమన్‌, హిప్‌ హాప్ తమిళ లాంటి సంగీత దర్శకులతో కలిసి ఆరు పాటలు పాడాను.. ఇప్పటి వరకూ బాలీవుడ్ తో పాటు కన్నడ, మళయాల సినిమాలకు సంగీతం
    అందించాను. నా పాటలన్నీ మాగ్జిమం యూత్ ఫుల్ సాంగ్స్. అలాంటిది ఓ థ్రిల్లర్ సినిమాకు సంగీతం చేసే అవకాశం రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇందులో పాటలు ఉండవు అని దర్శకుడు విజయ్ ముందే చెప్పాడు. అందుకే ఈ అవకాశం ఛాలెజింగ్ గా అనిపించి చేస్తాను అని చెప్పాను.

    తరుణ్ భాస్కర్‌ కారణంగానే

    తరుణ్ భాస్కర్‌ కారణంగానే

    నిజానికి ఈ సినిమా నాకు దర్శకుడు విజయ్‌ని పరిచయం చేసింది పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు టైమ్ లో సినిమా బావుందని మెసేజ్ చేశాను. తర్వాత ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వైఫ్ ఆఫ్ రామ్ దర్వకుడు విజయ్ ని పరిచయం చేసింది తరుణ్ భాస్కరే.

    అదృష్టంగా ఫీలవుతున్నా

    అదృష్టంగా ఫీలవుతున్నా

    వైఫ్ ఆఫ్ రామ్ వంటి సూపర్ థ్రిల్లర్ మూవీకి సంగీతం అందించడం నా అదృష్టంగా ఫీలవుతున్నాను.. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. సినిమాకు కథే హీరో. సంగీతానికి రెండో స్థానమే. సినిమా అద్భుతంగా ఉంది.
    మంచు లక్ష్మి నటనకు ఫిదా అయిపోతారు. ఆమె నటన బ్యాక్ గ్రౌండ్ అందించే వారికే ఛాలెంజ్ విసిరనట్టుగా అనిపించింది. ఖచ్చితంగా ఇది తెలుగులో బెస్ట్ థ్రిల్లర్ అవుతుంది. నా వంతుగా నేను బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే ప్రయత్నం చేశాను.

    ఎలాంటి ఇబ్బందులు రాలేదు

    ఎలాంటి ఇబ్బందులు రాలేదు

    భాషా పరంగా ఇబ్బందులు ఏమీ రాలేదు. నేటివిటీకి తగ్గట్టుగా సంగీతం వచ్చేందుకు దర్శకుడు విజయ్ చాలా హెల్ప్ చేశాడు. అతని సహకారంతనే బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వగలిగాను. ఇక నా వరకూ వస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని అనుకోలేదు. చాలాకాలం పాటు భరతనాట్యం నేర్చుకున్నా. సైంటిస్ట్ గానూ పనిచేశాను. బట్ విధి అంటారు కదా.. అదే నన్ను సంగీత దర్శకుడిగా మార్చింది. అందుకే ఇప్పుడు సంగీతమే నా లోకం అయింది.

    నా కల తీరింది

    నా కల తీరింది

    ఇక సింగర్ గా కంటే మ్యూజిక్ డైరెక్టర్ గానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను. అయినా వేరే వారి సంగీత దర్శకత్వంలో పాడేటప్పుడు సలహాలివ్వను.
    వారికేం కావాలో అదే పాడతాను. మొత్తంగా తెలుగు సినిమాలకు సంగీతం అందించాలన్న నా కల తీరింది. అది కూడా ఓ సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్ తో కావడం ఇంకా ఆనందంగా.. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే నా తెలుగు డెబ్యూ ఓ సూపర్ హిట్ తో ఉంటుందన్నమాట'' అంటూ ముగించాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్.ఇక ఈ నెల 20న విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

    సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, మాటలు : సందీప్ రెడ్డి

    గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ
    నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన,
    దర్శకత్వం : విజయ్ యెలకంటి.

    English summary
    Lakshmi Manchu’s upcoming film directed by Vijay Yelakanti is a psychological thriller that has been picturised with some interesting plot points. The recently released trailer received wide applause from many, including director ace S.S. Rajamouli himself. In fact, the film managed an official entry into the Ottawa Film Festival, where it has been termed a socially conscious thriller. The story revolves around a girl called Deeksha who works with an NGO and the tough fight she faces in the process of uncovering her husband’s suspicious death. The film has completed the censor formalities and was awarded a UA certificate by the board that was all praise for the film. It is now set to release on July 20. In this occasion, Raghu Dixit speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X