అన్నమయ్య కీర్తనలకు ఎ.ఆర్.రహమాన్ బాణీలు
పద్నాల్గవ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామిపై స్వరపరిచిన కీర్తనలను తనదైన బాణీలో భక్తులకు అందించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎ.ఆర్.రహమాన్ ను కోరనుంది. టి.టి.డి. ట్రస్ట్ బోర్డు చైర్మన్ డి.కె.ఎ.నాయుడు ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపినట్టు సమాచారం. అన్నమయ్య కీర్తనలను సరికొత్త బాణీలో కంపోజ్ చేయాల్సిందిగా రెహ్మాన్ ను కోరాలని తాము చర్చించిన మాట నిజమేననీ, రెహ్మాన్ తో సంప్రదించాలనే నిర్ణయాన్ని త్వరలోనే తీసుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు తెలిపారు. 'రెహ్మాన్ తన సేవలను అందించేందుకు ఆసక్తి చూపుతారనే నమ్మకం ఉంది' అని టిడిపి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.ఇక గతంలో వందేమాతరం ను తనదైన శైలిలో రహ్మాన్ ట్యూన్స్ కట్టి పాపులర్ చేసిన సంగతి తెలిసిందే.
More from Filmibeat
అన్నమయ్య ఎఆర్ రహమాన్ వెంకటేశ్వరస్వామి పులి జయహో తిరుమల తిరుపతి డికెఎ నాయుడు annamayya venkateswara swamy ar rahman puli oscar tirumala tirupati


Click it and Unblock the Notifications











