Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గూగుల్ లో ఆ స్టార్ హీరోయిన్ దే హవా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరో సారి వార్తల్లో నిలిచింది. ఇంటర్నెట్లో ఈ ఏడాది ఎక్కువ మంది భారతీయ నెటిజన్లు కత్రినా కైఫ్ కోసం వెతికారని గూగుల్ ఇండియా సర్వే తెలిపింది. అలాగే రాజకీయ నాయకుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ గాందీ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం. ఇక మూడో ప్లేసులో సచిన్ పైలట్ల గురించి తెలసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపారు. సచిన్ పైలట్ తర్వాత అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత సారా పాలిన్, పి.చిదంబరం, మాయావతి, బరాక్ ఒబామా, సోనియా గాంధీ, రాజేశ్ పైలట్, మేనక గాంధీ తర్వాత స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కంటే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన సారా పాలిన్పైనే భారతీయ నెటిజన్లు ఆసక్తి చూపడం విశేషమని ఆ రిపోర్టులో పేర్కొంది. సెర్చి ఇంజిన్లో భారత నెటిజన్ల ప్రశ్నలకనుగుణంగా గూగుల్ జీట్గీస్ట్ అనే సరికొత్త సర్వే చేపట్టింది. ఈ సర్వేలో క్రీడా విభాగంలో సానియామీర్జా వరుసగా మూడోఏడాది కూడా తొలిస్థానం ఆక్రమించింది. సైఫ్, దీపిక నటించిన 'లవ్ ఆజ్ కల్' చిత్రం ఎక్కువమంది వెతికిన బాలీవుడ్ చిత్రమని గురువారం విడుదల చేసిన సర్వేలో పేర్కొంది. బడ్జెట్-2009, 'సత్యం' కుంభకోణం అంశాలపై అత్యంత వేగవంతమైన ప్రశ్నలు అడిగారని సంస్థ వివరించింది.