Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రకుల్ ప్రీత్ సింగ్ను.. నాగార్జున రిజెక్ట్ చేశారా? దర్శకుడి వివరణ ఇదీ!
నాగార్జున సూపర్ హిట్ మూవీ 'మన్మధుడు' చిత్రానికి సీక్వెల్గా తాజాగా 'మన్మధుడు 2' మొదలైంది. డైరెక్షన్ వైపు మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన రూమర్ ఒకటి వైరల్ అవుతోంది.
రషెస్ చూసిన తర్వాత నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అప్ సెట్ అయ్యాడని, ఆమెను రిజక్ట్ చేశాడని, బరువు తగ్గిన తర్వాతే ఆమెతో మళ్లీ షూటింగ్ చేద్దాం, లేకుంటే వేరేవారిని చూసుకుందామని చెప్పినట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
ఈ వార్తలపై తాజాగా రాహుల్ రవీంద్రన్ స్పందించారు. అందులో నిజం లేదన్నారు. 'పోర్చుగీస్ షెడ్యూల్ తొలి రోజు నుంచి రకుల్ మాతో పని చేస్తోంది. ఆమె ఇంక్రెడబుల్ టాలెంట్ కలిగిన వ్యక్తి, ఆమెపై వస్తున్న రూమర్లలో నిజం లేదు' అని స్పష్టం చేశారు.
'మన్మధుడు-2' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా యూరప్లోనే జరుగుతోంది. ఇందులో అక్కినేని కోడలు సమంత కూడా కీలక పాత్రలో నటిస్తోంది. చిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో సమంత కూడా అతిథి పాత్రలో నటిస్తోంది. అతిథి పాత్రే అయినా ఆమె పాత్ర స్టోరీలో చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ చిత్రంలో లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.