Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్కినేని హీరోల విషయమై అవన్నీ పుకార్లే.. ఖండించిన రాహుల్ రవీంద్రన్
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ పుట్టుకురావడం కామన్. హీరో హీరోయిన్ల ఎఫ్ఫైర్స్ గురించి ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వింటుంటాం. అయితే ఈ మధ్యకాలంలో.. ఎక్కువగా ఫేం ఎవరవుతున్నారో వారినే టార్గెట్ చేస్తూ పుకార్లు పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఈ నేపథ్యంలోనే మన్మథుడు 2 సినిమా క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ త్వరలోనే అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్లతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని వార్తలు పుట్టించారు.
అయితే తాజాగా ఈ విషయమై స్పందించిన రాహుల్ రవీంద్రన్ అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అసలు ఆ వార్తను ఎవరు క్రియేట్ చేశారో తనకు తెలియదని, అందులో నిజం లేదని అన్నారు. ప్రస్తుతం తన దృష్టాంతా మన్మథుడు 2 సినిమాపైనే ఉందని, ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందని ఆసక్తిగా ఉందని చెప్పారు. మన్మథుడు 2 సినిమా విడుదలయ్యాక తన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తానని, ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
ఇక రాహుల్ ప్రెసెంట్ సినిమా మన్మథుడు 2 విషయానికొస్తే.. వయాకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందింది. చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్, సమంత కీలక పత్రాలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నడుమ రొమాంటిక్ సీన్స్ హైలైట్ కానున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఆగస్ట్ 9వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.