Don't Miss!
- News గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పబ్లిసిటీ కోసమే నాతో లవ్ అఫైర్!
తన తండ్రి రాజ్ కపూర్ కు అగ్ర హీరోయిన్లతో ప్రేమ సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ స్టార్ రిషికపూర్ అన్నారు.
అలనాటి బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్, వైజయంతిమాల మధ్య అఫైర్ వివాదాస్పదంగా మారింది. పబ్లిసిటీ కోసం అతిగా పాకులాడే రాజ్ కపూర్ తనతో ప్రేమ వ్యవహారం ఉందంటూ రూమర్ సృష్టించారని, అయితే ఆయన ప్రచారం చేసుకొన్న విధంగా తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని వైజయంతిమాల స్పందించారు. అయితే వైజయంతిమాల చేసిన వ్యాఖ్యాలను రాజ్ కపూర్ తనయుడు రిషికపూర్ తప్పుపట్టారు. ఈ అంశంపై రిషి స్పందిస్తూ 'మా నాన్న జీవించి ఉంటే వైజయంతిమాల ఆ విధంగా మాట్లాడి ఉండేవారు కాదు' అని అన్నారు.
బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ జీవితంలో పలు అంశాలను తన ఆటోబయోగ్రఫీ 'ఖుల్లం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్'లో పేర్కొన్నారు. ఆర్కే బ్యానర్లలో నటించిన నర్గీస్ తోపాటు అగ్రహీరోయిన్లు అందరితోనూ తన తండ్రికి అఫైర్ ఉందని ఈ పుస్తకంలో రిషికపూర్ తెలిపారు. ఈ పుస్తకం ఇటీవల ముంబైలో విడుదల చేశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకొని రిషికపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొన్న సంగతి తెలిసిందే.