Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పబ్లిసిటీ కోసమే నాతో లవ్ అఫైర్!
తన తండ్రి రాజ్ కపూర్ కు అగ్ర హీరోయిన్లతో ప్రేమ సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ స్టార్ రిషికపూర్ అన్నారు.
అలనాటి బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్, వైజయంతిమాల మధ్య అఫైర్ వివాదాస్పదంగా మారింది. పబ్లిసిటీ కోసం అతిగా పాకులాడే రాజ్ కపూర్ తనతో ప్రేమ వ్యవహారం ఉందంటూ రూమర్ సృష్టించారని, అయితే ఆయన ప్రచారం చేసుకొన్న విధంగా తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని వైజయంతిమాల స్పందించారు. అయితే వైజయంతిమాల చేసిన వ్యాఖ్యాలను రాజ్ కపూర్ తనయుడు రిషికపూర్ తప్పుపట్టారు. ఈ అంశంపై రిషి స్పందిస్తూ 'మా నాన్న జీవించి ఉంటే వైజయంతిమాల ఆ విధంగా మాట్లాడి ఉండేవారు కాదు' అని అన్నారు.
బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ జీవితంలో పలు అంశాలను తన ఆటోబయోగ్రఫీ 'ఖుల్లం ఖుల్లా: రిషికపూర్ అన్ సెన్సార్డ్'లో పేర్కొన్నారు. ఆర్కే బ్యానర్లలో నటించిన నర్గీస్ తోపాటు అగ్రహీరోయిన్లు అందరితోనూ తన తండ్రికి అఫైర్ ఉందని ఈ పుస్తకంలో రిషికపూర్ తెలిపారు. ఈ పుస్తకం ఇటీవల ముంబైలో విడుదల చేశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకొని రిషికపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొన్న సంగతి తెలిసిందే.