Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి ఆ దర్శకుడితో రాజ్ తరుణ్ న్యూ మూవీ.. సక్సెస్ కొత్త రూట్
టాలీవుడ్ లో అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకడు. కెరీర్ మొదట్లో ఈ కథానాయకుడు కేవలం మూడు సినిమాలతోనే మంచి మార్కెట్ సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదు. అందుకు కారణం అతను రెగ్యులర్ ప్రేమ కథలను ఎంచుకోవడమే. లవ్ స్టోరీలు కెరీర్ మొదట్లో ఉపయోగపడ్డయి. మార్కెట్ రేంజ్ ని కూడా పంచాయి. కానీ ఆ తరువాత సినిమాలు కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వెనక్కి తీసుకురాలేదు.
ఇక ఫైనల్ గా ఈ యువ హీరో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని రెడీ అయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా థియేటర్స్ లలో రిలీజ్ కాలేకపోతోంది. అక్టోబర్ 2న ఆహా యాప్ లో డైరెక్ట్ విడుదల కాబోతోంది. ఆ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే అదే దర్శకుడితో రాజ్ తరుణ్ మరో సినిమాను ప్లాన్ చెసుకుంటున్నాడు. ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ టైమ్ లోనే ఒక కొత్త తరహా కథను చెప్పి హీరోను మెప్పించిన దర్శకుడు విజయ్ లాక్ డౌన్ లో పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేశాడు.
ఈ రోజే సింపుల్ గా హైదరాబాద్ లోనే ఆ ప్రాజెక్టును లాంచ్ చేశారు. నెక్స్ట్ థియేటర్స్ ఓపెన్ అయ్యేలోపు వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదని డీజిటల్ రిలీజ్ కి ఒప్పుకోక తప్పలేదు. ఇక విజయ్ కుమార్ తో చేస్తున్న రెండవ సినిమా వనమల్లీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో రూపొందుతోంది.