Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి ఆ దర్శకుడితో రాజ్ తరుణ్ న్యూ మూవీ.. సక్సెస్ కొత్త రూట్
టాలీవుడ్ లో అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకడు. కెరీర్ మొదట్లో ఈ కథానాయకుడు కేవలం మూడు సినిమాలతోనే మంచి మార్కెట్ సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదు. అందుకు కారణం అతను రెగ్యులర్ ప్రేమ కథలను ఎంచుకోవడమే. లవ్ స్టోరీలు కెరీర్ మొదట్లో ఉపయోగపడ్డయి. మార్కెట్ రేంజ్ ని కూడా పంచాయి. కానీ ఆ తరువాత సినిమాలు కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వెనక్కి తీసుకురాలేదు.
ఇక ఫైనల్ గా ఈ యువ హీరో ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని రెడీ అయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ సినిమా థియేటర్స్ లలో రిలీజ్ కాలేకపోతోంది. అక్టోబర్ 2న ఆహా యాప్ లో డైరెక్ట్ విడుదల కాబోతోంది. ఆ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే అదే దర్శకుడితో రాజ్ తరుణ్ మరో సినిమాను ప్లాన్ చెసుకుంటున్నాడు. ఒరేయ్ బుజ్జిగా షూటింగ్ టైమ్ లోనే ఒక కొత్త తరహా కథను చెప్పి హీరోను మెప్పించిన దర్శకుడు విజయ్ లాక్ డౌన్ లో పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేశాడు.
ఈ రోజే సింపుల్ గా హైదరాబాద్ లోనే ఆ ప్రాజెక్టును లాంచ్ చేశారు. నెక్స్ట్ థియేటర్స్ ఓపెన్ అయ్యేలోపు వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒరేయ్ బుజ్జిగా సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదని డీజిటల్ రిలీజ్ కి ఒప్పుకోక తప్పలేదు. ఇక విజయ్ కుమార్ తో చేస్తున్న రెండవ సినిమా వనమల్లీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో రూపొందుతోంది.