Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చాలా కాలం తరువాత గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రాజ్ తరుణ్
చాలా కాలంగా బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ యంగ్ హీరోకి పెద్దగా కలిసి రావడం లేదు. కెరీర్ మొదట్లో ఫస్ట్ మూడు విజయాలతో కాస్త హడావుడి చేసిన ఈ కథానాయకుడు ఇప్పుడు మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా ఒకటి ఓటీటీలో డైరెక్ట్ వా విడుదలైన విషయం తెలిసిందే.
విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా లాక్ డౌన్ లోనే OTTలో రిలీజ్ అయ్యింది. అయినా కూడా ఆ సినిమాకు పెద్దగా హిట్ టాక్ ఏమి రాలేదు. ఇక మళ్ళీ అదే దర్శకుడితో పవర్ ప్లే అనే సినిమా తీసిన రాజ్ తరుణ్ శుక్రవారం గ్రాండ్ గానే రిలీజ్ చేశాడు. ఆ సినిమా రిజల్ట్ పై ఇంకా సరైన క్లారిటీ రాలేదు. అయితే రాజ్ తరుణ్ కు బూస్ట్ ఇచ్చే విధంగా ఒక మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ నటించిన డ్రీమ్ గర్ల్ రీమేక్ సినిమాలో రాజ్ తరుణ్ నటించనునట్లు గతంలోనే ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిర్మాత సురేష్ బాబు కరోనా లాక్ డౌన్ లో ఆర్థిక ఇబ్బందుల వలన ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ రీమేక్ ఆగిపోలేదని లాక్ డౌన్ అనంతరం త్వరలో సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది. మరి ఆ సినిమాతోనైనా రాజ్ తరుణ్ గతంలో మాదిరిగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.