Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలుశిక్ష.. ఏం జరిగిందంటే..
Recommended Video
టాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్లో అసిస్టెంట్ క్యాషియర్గా విధులు నిర్వహించేవారు.
నకిలీ బంగారం తాకట్టుపెట్టి
పోలీసుల కథనం ప్రకారం.. 2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.9.85 లక్షల రుణం తీసుకొన్నారు. బ్యాంక్ అధికారుల తనిఖీల్లో తాకట్టు పెట్టిన బంగారం నకిలీ అని తేలింది.
బ్యాంకు అధికారుల ఫిర్యాదు
దాంతో బసవరాజుపై బ్యాంకు మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం.. బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు బసవరాజును విచారించింది.
మూడేళ్ల జైలు, 20 వేల జరిమానా
పలు విచారణల అనంతరం ఈ కేసుపై మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తాజాగా తీర్పును వెల్లడించారు. రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు.
వరుస సినిమాలతో రాజ్ తరుణ్
ప్రస్తుతం రాజ్ తరుణ్ తెలుగు సినిమా పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన కెరీర్లో మంచి విజయాలు సొంతం చేసుకొంటున్నారు. తాజా ఘటనపై వ్యాఖ్యానించడానికి సినీ వర్గాలు నిరాకరించాయి.