Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజా, మంజరి 'ఇంకోసారి' మ్యాటర్ ఏంటి?
రాజా, మంజరి జంటగా సుమన్ పాతూరి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ 'ఇంకోసారి' చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కధ గురించి నిర్మాత చెబుతూ.. 'కాలేజీలో సరదాగా గడిపిన ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎక్కడెక్కడో సెటిలవుతారు. ఫ్రెండ్స్తో ఇంకోసారి సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా ఇంకోసారి కలుసుకున్న స్నేహితుల కథే ఈ చిత్రం. ఆ కలయిక వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది..స్నేహం నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఉండే చిత్రమిది...అంటున్నారు.
అలాగే ఈ ఇంకోసారి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్త చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఈ చిత్రం ఆడియోను నవంబర్ 4న జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, 'దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్లీ 'వెన్నెల' టీమ్తో, అదే స్పిరిట్తో ఈ సినిమా చేశాను. 'వెన్నెల' స్థాయిలోనే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను' అన్నారు. దర్శకుడు సుమన్ పాతూరి మాట్లాడుతూ, 'స్నేహం, వినోదం, మంచి సంగీతం ఈ బిజీ జీవితంలో సేద తీరడానికి ఎవరైనా కోరుకునేవి. ఈ మూడు అంశాలూ ప్రధానంగా, ఆహ్లాదభరితంగా ఈ సినిమా ఉంటుంది' అని తెలిపారు. బెస్టాఫ్ లక్ సుమన్ పాతూరి.