twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ మే 15న రావడంలేదు, డేట్స్ ప్రకటించిన రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' చిత్రాన్ని మే 15న విడుదల చేస్తున్నట్లు గతంలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెక్నికల్ పరమైన అంశాల విషయంలో ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసారు. సినిమా వాయిదాపై వివరణ ఇస్తూ రాజమౌళి ఓ ప్రకటన కూడా చేసారు.

    సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నామని చెప్పిన రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘బాహుబలి' మొదటి భాగాన్ని జులైలో సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బాహుబలి అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. మే 31 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు రాజమౌళి తెలిపారు.

    తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని రాజమౌలి తెలిపారు.

    అబ్బురపరుస్తున్న ‘బాహుబలి' సెట్స్ (ఫోటోస్)

    ‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది.

    Rajamouli Announces Key Dates Of Baahubali

    ఇప్పటికే బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ అయ్యాయి. అబ్బుర పరిచేలా ఉన్న సెట్టింగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నారు.

    దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ‘బాహుబలి.. ది బిగినింగ్' పేరుతో విడుదల చేస్తున్నారు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

    ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

    English summary
    It is known that Rajamouli have announced the release date of Baahubali as May 15th. But due to technical glitches, the film had to postpone its release. Confirming the postpone, Rajamouli has finally come up with an explanation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X