రాజమౌళి చైల్డ్ హీరోగా చేసిన సినిమా 'పిల్లన గ్రోవి'
మగధీర వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి చిన్న వయస్సులో హీరోగా(ప్రధానపాత్రగా) పిల్లనగ్రోవి అనే చిత్రంలో చేసారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్టు ఓ ప్రముఖ దినపత్రికలో రాసుకొచ్చారు. ఈ చిత్రం పాతికేళ్ల క్రితం తయరైంది. అయితే రిలీజుకు నోచుకోలేదు.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సోదరుడు రచయిత శివశక్తి దత్తా డైరక్టర్. కథ మొత్తం ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో చిన్న పిల్లల చుట్టూ తిరుగుతూ ఈ కథ సాగుతుంది. ఇందులో చిన్నపిల్ల పాత్రకు తన తమ్ముడు కూతరు శ్రీలేఖని(సంగీత దర్శకురాలు)ఎంపికచేసారు శివశక్తి దత్తా. అలాగే కథకు ప్రాణమైన బాలకృష్ణుడి పాత్రకు బొద్దుగా ఉండే రాజమౌళి ని తీసుకున్నారు. మిగతా పాత్రల్లో జె.వి.సోమయాజులు, మిక్కిలినేని, నిర్మలమ్మ తదితరులను కనిపిస్తారు. ఆ షూటింగ్ అంతా పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, పరిసర ప్రాంతాల్లో చేశారు. అయితే డబ్బు ఇబ్బందులతో ఆ చిత్రం ఆగిపోయింది. డబ్బు వచ్చాక ఆ సినిమాను పూర్తి చేద్దామని అనిపించింది. అయితే అప్పటికే శ్రీలేఖ, రాజమౌళి పెద్దవాళ్ళయిపోయారు. దాంతో సినిమా ఆగిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే..ఈ పిల్లనగ్రోవికి కీరవాణి స్వరాలందించారు. అలా రాజమౌళి చిన్నప్పుడే తెరపై కనపించారన్నమాట.


Click it and Unblock the Notifications











