Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ప్రభాస్ మూవీకి 120 గుర్రాలు బుక్ చేసిన రాజమౌళి
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కాంబినేషన్లో భారీ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగుళతో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా తీర్చిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం హైదరాబాద్ సిటీ ఔట్ స్కర్ట్స్లో 25 ఎకరాల్లో భారీ సెట్ వేయడంతో పాటు, షూటింగ్ కోసం 10 డజన్ల(120) గుర్రాలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఇది వరకు తీసిన కమర్షియల్ చిత్రాలు, మగధర, ఈగ లాంటి అద్భుతమైన చిత్రాలకు ఏ మాత్రం పోలిక లేకుండా ఈ చిత్రం ఉండబోతోంది.
ఇన్ని గుర్రాలతో సినిమా అంటే....ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. చారిత్రక పోరాట సన్నివేశాలను హాలీవుడ్ రేంజిలో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'ఛత్రపతి' చిత్రం భారీ హిట్ అయిన నేపథ్యంలో ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
ప్రస్తుతం ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో వారధి(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్ ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది. జనవరి 11న విడుదల కానుంది.