Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి తాపత్రయం అంతా అందుకే...!
రీసెంట్ గా విడుదలైన 'వేదం" చిత్రం గురించి రాజమౌళి ట్విట్టర్ లోనూ, క్రిష్ తో పాటు పాల్గొన్న రాజమౌళి టీవీలో ఇంటర్వ్యూలో నూ చాలా గొప్పగా చెప్పారు..బాగా ప్రమోట్ చేశారు. అయితే ఆయనంత తాపత్రయపడింది తన 'మర్యాద" కాపాడుకోవడానికే అనేది ఇండస్ట్రీ టాక్. వివరాల్లోకి వెళితే..'వేదం" నిర్మాన సంస్థ అయిన ఆర్కామీడియా బేనర్ లోనే ప్రస్తుతం 'మర్యాద రామన్న" సినిమా చేస్తున్నారు రాజమౌళి. తను టాప్ డైరెక్టర్ అయినప్పటికీ ఈ సినిమా రెమ్యూనరేషన్ ని మాత్రం వచ్చే లాభాల్లో వాటాగానే తీసుకుంటానని రాజమౌళి చెప్పారట.
కాగా ఆల్ రెడీ రాజమౌళి సినిమాగా 'మర్యాద రామన్న"కి మంచి బిజినెస్ క్రేజ్ వచ్చేసింది. ఈ దశలో వేదం ఫలితం తారుమారైతే రికవరీ కోరే పంపిణీదారులందరూ 'మర్యాద రామన్న" పై పడతారు కనుక ఎలాగైనా ఆ సినిమాని గట్టెక్కించాలనే ప్రయత్నంలో రాజమౌళి కూడా పాలుపంచుకున్నారని. మాట సాయం చేశారని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..'వేదం" లావాదేవీలేమైనా వుంటే మళ్ళీ క్రిష్ సినిమాతోనే చూసుకుందాం అన్నట్టు ఇదే సంస్థలో క్రిష్ మరో సినిమా చేస్తారనే ప్రకటన కూడా రావడం..!