రాజమౌళి ఏంకర్ గా టీవీ పోగ్రాం సెప్టెంబర్ 9 నుంచి...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో బుల్లి తెరను పలకరించనున్నాడు. హెమ్ ఎమ్ టీవీ ఛానెల్ లో త్వరలో టెలీకాస్ట్ కాబోయే ఓ పోగ్రామ్ కి ఆయన ఏంకరింగ్ చేయనున్నారు. పోగ్రామ్ పేరు..కమాన్ ఇండియా. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లోనూ కన్ఫర్మ్ చేసారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ దేశభక్తి సంభందింత పోగ్రాం టెలీకాస్ట్ కానుంది.భారత్ మహాన్ అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ ఈ పోగ్రాం సాగుతుంది. దేశభక్తి..సమాజంలో నెలకొని ఉన్న లంచగొండితనం, సమాజంలో మార్పు వంటి అంశాలు ఈ పోగ్రామ్ లో చోటు చేసుకుంటాయి. దర్శకుడుగానే కాక ఓ భారతీయ పౌరుడుగా తన బాధ్యతను నెరవేరుస్తున్న రాజమౌళికి ధట్స్ తెలుగు బెస్టాఫ్ లక్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











