Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వారిరువురికి అవార్డులు రాకపోవడం బాధించింది: రాజమౌళి
టెక్నికల్ గా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన సినిమాగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నబ్లాక్ బస్టర్ 'మగధీర" చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం అయినప్పటికీ ఆ సినిమాకు ఇంకా అవార్డులు ఎక్స్ పెక్ట్ చేసానని, రెండు మాత్రమే రావడంతో డిస్అపాయింట్ మెంట్ అయ్యానని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఐబిన్ లైవ్ చానల్ టెలిపోన్ లో సమాదానం ఇచ్చాడు. అంతే కాకుండా దీని పై మరేవిధంగా స్పందిచలేనని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. అంతే కాకుండా ట్విట్టర్ ద్వారా అవార్డ్ విన్నర్స్ ను తెలియజేసిన ఆయన అభిమానులకు తను స్పెషల్ థాక్స్ తెలియజేశారు.
స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన'కమల్ కణ్ణన్"కు, కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ కు ఈ అవార్డులు రావడం హ్యాపీగానే వున్నప్పటికీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కు రాకపోవడం కొంత బాధ కలిగించింది" అన్నాడు రాజమౌళి. 140కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో 'రోబో" చిత్రాన్ని రూపొందిస్తున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ఇప్పటి వరకు సౌత్ లో రూపొందిన సినిమాలన్నింటిలో 'మగధీర" విజువల్ గా, గ్రాఫిక్స్ పరంగా చాలా గొప్ప సినిమా అని ప్రశంసించడం విశేషం.