Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి నన్ను కలవలేదు..నేనే అతన్ని అలిసాను: రాజమౌళి
తన నూట యాభైవ చిత్రానికి శంకర్ లేదా మరెవరైనా దిగ్గజ దర్శకుడు పని చేస్తే బాగుంటుందని చిరంజీవి చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు చిరుతో పని చేయడానికి సిద్దంగా ఉన్నాకానీ ఆయన మాత్రం వారి కంటే పెద్ద రేంజ్ వాళ్లతో చేయాలిన అనుకుంటున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి దృష్టి రాజమౌళి పై పడిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల చెప్పా పెట్టకుండా 'ఈగ" సినిమా సెట్స్ మీద చిరంజీవి వాలడం ఈ చర్చకి తావిచ్చింది.
అయితే చిరంజీవి నటించే 150 వ సినిమాకి తాను దర్శకత్వం వహిస్తున్నానంటూ వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఖండించాడు. 50 కోట్ల ప్యాకేజీతో చిరంజీవి తన సినిమా బాధ్యతలను రాజమౌళి చేతిలో పెట్టాడంటూ ఇటీవల కొన్ని వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని రాజమౌళి అంటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న 'ఈగ' సినిమా తర్వాత ప్రభాస్ తో రూపొందించే సినిమా స్టార్ట్ అవుతుందనీ, ఆ కమిట్ మెంట్స్ లో ఎటువంటి మార్పూ లేదని చెప్పాడు.
అలాగే, ఇటీవల రామానాయుడు స్టూడియోలో తాను 'ఈగ' షూటింగులో వుండగా తన సెట్స్ కు చిరంజీవి వచ్చినట్టుగా 'ఓ ప్రముఖ పత్రిక'లో వచ్చిన వార్తను కూడా రాజమౌళి సవరించాడు. 'చిరంజీవిగారు నన్ను కలవడానికి వచ్చేరన్నట్టుగా వార్త రాశారు. అది వాస్తవం కాదు. స్టూడియోకి ఆయన వేరే పని మీద వస్తే, నేనే వెళ్లి కల్సి గ్రీట్ చేశాను' అన్నాడు రాజమౌళి.