Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లుతో విభేదాలా? రాజమౌళి మనస్ధాపానికి కారణం?
తెలుగుసినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు ( సుమారు 120 కోట్లు)పొందిన "మగధీర" సినిమాను మలిచిన ప్రతిభాశాలి రాజమౌళి ఇప్పుడు బాధపడుతున్నారా? ఆ సినిమా మెగా హిట్ అయిన ఆనందం ఆయనలో ఎక్కువకాలం నిలువలేదు. షూటింగ్ సమయంలోనే అల్లు అరవింద్ తో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. సినిమా విడుదల సమయంలో కథకు సంబంధించిన వివాదం వచ్చింది. ఎస్పీ చారి ఆ కథను తన నవల నుంచి దొంగిలించారని అన్ని టీవీ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. కథ కోసమే తన తండ్రి విజయేంద్రప్రసాద్ కు దాదాపు కోటి రూపాయలు అల్లు అరవింద్ ద్వారా ఇప్పించినట్టు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వదంతి ప్రచారంలో ఉంది. కథ విషయంలో వివాదాన్ని పక్కన పెడితే, దర్శకుడిగా రాజమౌళి ప్రతిభను ఎవరూ కాదనలేరు. చిన్న వయసులోనే అంత పరిపక్వతను ఆయన సాధించడం గొప్ప విషయమే. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన పెద్ద వరం అనడంలో సందేహం లేదు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ఫంక్షన్ లో రాజమౌళి అదుర్స్ ను విపరీతంగా పొగిడారు. తన మగధీర కలెక్షన్లను అదుర్స్ అధిగమించాలని ఆకాంక్షించారు. దానిని ఆకాంక్ష అనడం కంటే అల్లు మీద కక్ష అనడం సముచితంగా ఉంటుందేమో. ఏది ఏమైనా అల్లు అరవింద్- రాజమౌళి కుటుంబం మధ్య రగిలిన కక్షల వల్ల మరో పదేళ్ల వరకు గీతా ఆర్ట్స్ తో రాజమౌళి సినిమా వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.