Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళికు ప్రియాంక చోప్రా నుంచే ట్విస్ట్, ఫైనల్ గా ఏమౌతుందో
హైదరాబాద్: ఎప్పటిలాగే.. 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినీలను అనౌన్స్ చేసింది సీఎన్ ఎన్ న్యూస్ 18 గ్రూప్. అయితే ఈ జాబితాలో రాజమౌళి పేరు నామినేట్ చేయబడి ఉండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆయనకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నుంచి పోటీ ఎదురౌతోంది.
ఆ లిస్ట్ లో రాజమౌళి, ప్రియాంక చోప్రా,రణ్ వీర్ సింగ్, సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు. రాజమౌళి తప్ప మిగిలినవారంతా బాలీవుడ్ సెలెబ్రెటీలు కావటం తెలుగు వారికి కొంచెం బాధించే విషయమే. అయినా రాజమౌళికు ఆ అవార్డ్ వస్తే మనకు ఆ బాధ తొలుగుతుంది.
ఇక ఇప్పటికి నామినేషన్స్ మాత్రమే అయినా ఓటింగ్, సెలక్షన్ అయి ఆ తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అయితే ఇప్పటికే ఎన్నో దేశ విదేశీ అవార్డులను ఖాతాలో వేసుకున్న రాజమౌళికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ రాజమౌళికి మాత్రం ప్రధాన పోటీ ప్రియాంక చోప్రా నుంచే అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఆశక్తిక కర పోటీలో రాజమౌళి ప్రియాంక పై పైచేయి సాధిస్తాడా లేదా అన్న విషయం తేలాలి అంటే మరి కొన్నిరోజులు ఆగాలి..
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాల్లో ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించి పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజమౌళి నామినేట్ అయ్యారు. ఆన్లైన్లో నిర్వహించే ఓ పోల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఈ అవార్డు ప్రకటించనున్నారు.