Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్.. యుద్ధం తరువాత, ఎన్టీఆర్ గురించి చాలా రోజులపాటు.. రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఫ్యాక్షన్ కథని సరికొత్తగా చెప్పడంలో త్రివిక్రమ్ విజయం సాధించారు. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరరాఘవ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించాడని ప్రశంసలు దక్కుతున్నాయి. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై దర్శక ధీరుడు జక్కన తాజగా ప్రశంసలు కురిపించాడు.
డేరింగ్ స్టెప్
యుద్ధం తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే పాయింట్ మీద కథ రాసుకోవడం నిజంగా త్రివిక్రమ్ తీసుకున్న డేరింగ్ స్టెప్ అని రాజమౌళి ప్రశంసించారు. ఆ ప్రయత్నం అద్భుతంగా ఫలించిందని తెలిపాడు. ఫ్యాక్షన్ కథని త్రివిక్రమ్ సరికొత్తగా చూపించారని ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
|
చాలా కాలం ఎన్టీఆర్ గురించి
ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన గురించి చాలా కాలంపాటు మాట్లాడుకుంటారు. ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని రాజమౌళి ప్రశంసించాడు. అదే విధంగా ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా అదరగొట్టాడంటూ రాజమౌళి ట్విట్టర్ లో తెలిపాడు. సినిమా విజయం సాధించినందుకు చిత్ర యూనిట్ మొత్తానికి రాజమౌళి శుభాకాంక్షలు తెలియజేశారు.
వసూళ్ల జోరు
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత చిత్రం తొలి షో నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ అందుకుని దూసుపోతుండగా.. రెండు తెలుగు రాష్ట్రలో నాన్ బాహుబలి రికార్డులని చెరిపేస్తోంది. దసరా సెలవుల్లో అరవింద సమేత వసూళ్ల పండగ ఖాయం అని అంటున్నారు.
రాజమౌళి దర్శత్వంలోనే
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తదుపరి నటించబోయే చిత్రం రాజమౌళి దర్శత్వంలోనే ఉండనున్న సంగతి తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినికిడి.