పద్మ పురస్కారం అందుకున్న రాజమౌళి (ఫోటోస్)
హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ పురస్కారాలకు ఈ సారి సినిమా రంగం నుండి రజనీకాంత్, రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. రజనీకాంత్ పద్మవిభూషణ్ పురస్కారానికి, రాజమౌళి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
తాజాగా మంగళవారం రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజమౌళి, రజనీకాంత్ తదితరులు పద్మపురస్కారాలు అందుకున్నారు. బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు మీడియా రంగానికి సంబంధించి రాజమోజీరావు కూడా పద్మవిభూషణ్ ఈ పురస్కారం అందుకున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను రాజమౌళి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...

రాజమౌళి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న రాజమౌళి.

రజనీకాంత్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న రజనీకాంత్

ప్రియాంక
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ప్రియాంక

పద్మ పురస్కారాలు
పద్మ పురస్కారాలు..


Click it and Unblock the Notifications











