Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా 'విజయసింహా' చిత్రం ఆగిపోయింది కానీ...రాజమౌళి
"నేనూ ప్రకాష్ కలిసి 'విజయసింహా' అనే చిత్రానికి పనిచేయాల్సింది. కానీ అది ఆగిపోయింది అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం విడుదల తర్వాత రాజమౌళి, రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ కాంబినేషన్ లో 'విజయసింహా' అనే జానపద చిత్రం ప్లాన్ చేసారు. అందుకోసం ప్రకాష్ గుర్రపు స్వారీ, కత్తి తిప్పటం వంటివి కూడా ప్రాక్టీస్ చేసారు. అయితే రెండు రోజుల్లో షూటింగ్ అనగా ప్రకాష్ తన తండ్రి వద్దకు వచ్చి తాను చేయలేనని చేతులెత్తేసారు. అయితే అప్పుడు కలిగిన ఆ ఇంట్రస్టుతోనే ఆయన అనగనగా ఒక ధీరుడు చిత్రాన్ని రూపొందించారు. అలాగే రాజమౌళి...మగధీర చిత్రం చేసారు. ఇక ఈ విషయాన్ని రాజమౌళి...అనగనగా ఒక ధీరుడు ఆడియో పంక్షన్ లో ప్రస్తావించారు. అలాగే ప్రకాష్ గురించి చెబుతూ.. 'సినిమాను డిఫరెంట్గా చేద్దాం' అని అంటుండేవాడు. ఆ డిఫరెంట్కు అర్థం ఈ ట్రైలర్ చూశాక తెలిసొచ్చింది. అతని కథల్లో చందమామ కథలూ ఉంటాయి. ఇప్పటి హాలీవుడ్ టెక్నాలజీ కనిపిస్తుంది. సిద్ధార్థ ను ఈ సినిమా లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడేస్తుంది. మోహన్బాబుకి తాను గొప్ప నటుడినన్న గర్వం ఉంది. లక్ష్మీ ఆ గర్వాన్ని పోగొట్టాలని ఆకాంక్షిస్తున్నాను" అని రాజమౌళి అన్నారు.