Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బాహుబలి’ మెగా సక్సెస్ కంటే గొప్ప.... రాజమౌళి గురించి రోబో ‘2.0’ నిర్మాత
రోబో 2.0 నిర్మాత రాజు మహాలింగం రాజమౌళిని కలిశాడు. రాజమౌళి సార్ ది ఎంతో గొప్ప మనసు అని ట్వీట్ చేశాడు.
రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్తో రోబో '2.0' సినిమాను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన రాజు మహాలింగం బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని కలిశారు. జక్కన్నను కలిసిన అనంతరం ఆయన ట్విట్టర్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
'రాజమౌళిని కలిసిన తర్వాత ఆయన ఎంతో వినయం, వినమ్రత కలిగిన వ్యక్తి అని అర్థమైంది. ఆయన హ్యుమిలిటీ బాహుబలి మెగా సక్సెస్ కంటే కూడా గొప్పది. రెస్పెక్ట్ సర్' అంటూ రాజు మహాలింగం ట్వీట్ చేశారు.
|
ఎందుకు కలిసినట్లు?
రాజమౌళి, రాజు మహాలింగం మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరి కాంబినేషన్లో భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీకి చెందిన వారు చర్చించుకుంటున్నారు.
రోబో 2.0
రాజమౌళి గురించిన ట్వీట్ కంటే ముందు ఆయన రోబో 2.0 చిత్ర విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2018లో సినిమాను భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు తెలిపారు.
400 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాం
రోబో 2.0 సినిమా కోసం రూ. 400 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాం. ఈ సినిమాను 3డి ఫార్మాట్లో కూడా షూట్ చేశాం. ఇండియాలో కేవలం 1500 3డి స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని ఎక్కువ 3డి స్క్రీన్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
గొప్ప విజయం అందుకుంటుంది
రోబో 2.0 గొప్ప విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. రజనీకాంత్, అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్, శంకర్ డైరెక్షన్, గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్ అవుతాయని తెలిపారు.