twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మర్యాదలతోనే విరక్తి పుట్టించే పనిలో రాజమౌళి

    By Srikanya
    |

    తిట్లు,దెబ్బలు ఎన్ని అయినా భరించవచ్చు గానీ, అతి మర్యాదలు..అదే అతిధి మర్యాదలు భరించటం కష్టమే. అదే సునీల్ హీరోగా రూపొందనున్న మర్యాదరామన్న చిత్రంలో మనం చూడబోయేది. ఈ చిత్రంలో రాయలసీమలో ఓ ఇంటికి అతిథిగా వెళ్లాడు మన హీరో రాము(సునీల్). అతిథి మర్యాద ఎలా ఉండాలో చూపించేశారు వాళ్లు. 'అది తినండి..ఇది తినండీ' అంటూ ప్రేమగా పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించారు. ఆ ఇంట్లో ఉన్నంత సేపే ఆ రాజభోగం. గుమ్మం దాటాడో...ఇక అంతే సంగతులు. 'పీక కోస్తాం' అంటూ వెంట పడతారు. ఎందుకంటే రాము..ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్ధి కొడుకు. అతని కోసం చావు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఆ ఇంటికే వచ్చిపడ్డాడు రాము. దాంతో రాయలసీమ సంప్రదాయం ప్రకారం ఆ ఇంట్లో ఉన్నంత సేపు అతనికి అతిధి మర్యాదలు చేయాలి. బయిట దొరికితేనే చంపాలి. అందుకోసం వారు బయిట ఎదురచూస్తూంటారు.

    అయితే ఆ పరిస్ధితులు తెలిసిన రాము పొరపాటున కూడా ఆ ఇంట్లోనుంచి బయిటపడే ప్రయత్నం చేయడు. వాళ్ళు లోపల తెలివిగా తమ అతిధి మర్యాదలతో అతన్ని బయిటకు పంపే ప్రయత్నం చేయాలని చూస్తూంటారు. ఈ చిత్రమైన పరిస్థితుల మధ్య మా హిరో ఎలా ఇరుక్కున్నాడో సినిమాలో చూడండి అంటున్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మర్యాద రామన్న'. సలోని హీరోయిన్ గా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని పాటల్ని జులై 4న విడుదల చేస్తున్నారు. పాటలు: సీతారామశాస్త్రి, అనంత్‌శ్రీరామ్‌, రామజోగయ్య శాస్త్రి, చైతన్యప్రసాద్‌; స్త్టెలింగ్‌: రమా రాజమౌళి, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌, కళ: ఎస్‌. రవీందర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X