Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అటు నుంచి నరుక్కొస్తున్న రాజమౌళి తనయుడు
హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి టాలీవుడ్ నెం.1 డైరెక్టర్గా తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇతర దర్శకులంతా మూస పద్దతిలో సినిమాలు తీసుకుంటూ వెలుతుంటే...తనదైన సరికొత్త ఆలోచన నైపుణ్యాలను తెరకెక్కిస్తూ అపజయం అనే మాట తెలియకుండా ముందుకు సాగుతున్నాడు జక్కన్న.
హీరోల ఇమేజ్తో మాత్రమే సినిమాలు నడుస్తాయని ఈ మధ్య ప్రభలిన జాడ్యాన్ని, పరిస్థితిని మార్చి....దర్శకుడి ప్రతిభ, పనితనం వల్లనే సినిమాలు విజయవంతం అవుతాయనే పాత పరిస్థితిని తీసుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి' అనే చిత్రం రూపొందిస్తుంటే ఆయన గురువు రాఘవేంద్రరావు రాజమౌళి ఆ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలనే ఉత్సాహంతో శిష్యుడి వద్దనే అసిస్టెంట్గా చేరడానికి సిద్ధమయ్యారంటే రాజమౌళి పనితనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ విధంగా రాజమౌళి గురువును మించిన శిష్యుడు అని పించుకుంటుంటే....రాజమౌళి కుమారుడు కార్తికేయ తండ్రిని మించిన తనయుడిని అనిపించుకునేందుకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడు. రాజమౌళి కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే పరిమితం అయితే.....కార్తికేయ బాలీవుడ్ నుంచి నరుక్కొస్తున్నాడు. నిర్మాతగా, దర్శకుడిగా రాణించాలనేది కార్తికేయ ఆలోచనట.
ఇప్పటికే కార్తికేయ బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ లాంటి టాప్ డైరెక్టర్లతో టచ్లో ఉన్నాడు. దర్శకత్వంలో మొళకువలు నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రాన్స్లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనురాగ్ కశ్యప్తో కలిసి ఉన్నాడు. అనురాగ్ కశ్యప్ చిత్రం 'అగ్లీ' కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్లో ప్రదర్శితం అవుతుండటంతో కార్తికేయను కూడా తీసుకెళ్లాడు. కార్తికేయ భవిష్యత్ లో మంచి నిర్మాత అవుతాడని ప్రశంసించారు అనురాగ్.
ఈ విషయం గురించి రాజమౌళి తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ...'నేను అనురాగ్ కశ్యప్ను కలవలేక పోయాను. కానీ కార్తికేయ అతన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కలుసుకున్నాడు. అనురాగ్ అతని మూవీ 'అగ్లీ' ప్రీమియర్ షోకి కార్తికేయను కూడా తీసుకెళ్లాడు' అంటూ ట్విట్ చేసాడు.