twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి, సునీల్ సినిమా స్టార్ట్

    By Staff
    |

    Sunil
    ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న సునీల్-రాజమౌళి కాంబినేషన్ సినిమా ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలు ఈ ప్రారంభానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్కా మీడియా వర్క్ బ్యానర్ పై శోభా యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మర్యాదరామన్న అనే టైటిల్ డిసైడ్ చేసారు.సలోని హీరోయిన్ గా చేస్తోంది.

    ఈ చిత్రం గురించి రాజమౌళి చెపుతూ నేను ఎప్పుడో ఈ బ్యానర్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. అందుకోసం అప్పట్లో రెండు లక్షల నూట పదహారు రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. కానీ ఆ అవకాశం ఇంతకాలానికి కానీ రాలేదు. అలాగే ఈ చిత్రంలో నా రెగ్యులర్ సినిమా నుంచి బయిటకు వచ్చి చేస్తున్నా. అలాగని ఆర్ట్ సినిమా మాత్రం కాదు. నేను లవ్ స్టోరీలు తీయలేను. ఇది ఓ కామిడీ ధ్రిల్లర్. నా ప్రెండ్ వర ముళ్లపూడి(నా అల్లుడు డైరక్టర్) ఈ స్టోరీ లైన్ చెప్పారు. అప్పుడు సునీల్ ఈ కధకు కరెక్టుగా సరిపోతాడనిపించింది. రాయలసీమ నేపధ్యంలో ఈ కథ సాగినా ఫ్యాక్షన్ మాత్రం ఉండదు. రాయలసీమ అతిధి మర్యాదలకు పేరు పడింది. అక్కడ జరిగే అతిధి మార్యాదలే ప్రధానాంశంగా ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ చూసేవాళ్లకు కామెడీ పంచుతుంది.

    ఇక సునీల్ ఈ సినిమా గురించి చెపుతూ అందాలరాముడు చిత్రం తర్వాత ఎన్నో కథలు విన్నాను కానీ నేను ఎగ్జైట్ అయ్యే కథ ఎవరూ చెప్పలేకపోయారు. దాంతో హీరోగా మళ్ళి చేయలేదు. అయితే ఈ కథ విన్నాను..చాలా ఆనందంగా ఉంది రాజమౌళితో చేయటం అన్నారు. జూలై, ఆగస్టులలో ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ చిత్రంలోని ఐదు పాటలను కీరవాణి సంగీతం అందిస్తునారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఛోటా కె.నాయుడు కెమెరా అందిస్తూంటే, కాంచి ఈ చిత్రానికి కథ, రవీందర్ ఆర్ట్ డైరక్షన్, రమా రాజమౌళి స్టైలింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X