Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా నెగెటివ్ కానీ ఇంకో మూడు వారాలు.. జక్కన్న ట్వీట్ వైరల్
దర్శకధీరుడు రాజమౌళికి కరోనా వైరస్ సోకిందన్న సంగతి తెలిసిందే. రాజమౌళికే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరక జక్కన్న స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. తనకు, కుటుంబానికి కొన్ని రోజులుగా జ్వరం ఉందని, టెస్ట్ చేయించుకోగా కరోనా పాజివ్ వచ్చిందని, అందుకే క్వారంటైన్కు వెళ్తున్నామని జూలై 29న ప్రకటించాడు. అయితే తాజాగా జరిపిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపాడు.
రాజమౌళి తన ఆరోగ్యంపై ఇచ్చిన ప్రకటన అందరిలోనూ ఆనందాన్ని నింపింది. కరోనా నుంచి కోలుకోవడం పట్ల జక్కన్న అభిమానులు సంతోషంలో తేలిపోతోన్నారు. కరోనా నుంచి కోలుకున్నామని జక్కన్న చెబుతూ.. 'రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది.ఎటువంటి లక్షణాలు లేవు.. దీంతో మరోసారి నిర్వహించిన పరీక్షల్లో మా అందరికి కరోనా నెగిటివ్ వచ్చింది. అవసరమైన మేర యాంటీబాడీలు వృద్ధి చెంది ప్లాస్మా డొనేట్ చేయడానికి ఇంకో మూడు వారాలు వెయిట్ చేయాలని వైద్యులు సూచించారు.' అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.
కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని, వాటి ఆవశ్యకత ఏంటి? అనేది చిరంజీవి, మహేష్ బాబు లాంటి వారంతా మీడియా ముఖంగా వివరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సైతం ఆనాడు ఇదే చెప్పాడు. కరోనా పాజిటివ్ అని తెలిశాక.. యాంటీ బాడీస్ వృద్ది చెందాక ప్లాస్మా దానం చేసేందుకు మళ్లీ తిరిగివస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.