Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎన్టీఆర్ దమ్ముని మెచ్చుకున్న రాజమౌళి
రాజమౌళికి, ఎన్టీఆర్ కి ఉన్న సాన్నిహిత్యం సినీ అభిమానులకు తెలియంది కాదు. తాజాగా ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ముని మెచ్చుకుంటూ రాజమౌళి ట్వీట్ చేసి ఆ విషయం మరో సారి గుర్తు చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలకు సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఆ పాటల గురించి రాజమౌళి ట్వీట్ చేస్తూ...ఎమ్.ఎమ్.కీరవాణి ఎప్పుడు అంతటి ఎనర్జీ ఉన్న పాటలను ఇవ్వటం నేను చూడలేదు. ఆ పాటల విన్నాక బోయపాటి మరోసారి మాస్ సినిమాని రీ ఢిఫైన్ చేస్తారని అనిపించింది. సినిమా గురించి ముందుగా మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను అన్నారు. ఇక రాజమౌళి ఈ చిత్రంలోని నాలుగు పాటలను విన్నారు.
ఇక ఈ చిత్రం కోసం రెండు షెడ్యులను ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేసారు. ప్రస్తుతం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఊసరవిల్లి షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఊసరవెల్లి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. విడుదలకు ముందే ఈ చిత్రం మంచి ఊపు అందుకుంది. భారీ గా అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ బ్రహ్మాండమైన రేటు ఇచ్చి దక్కించుకుంది.