twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి అలాంటోడు కాదు, అవేమీ వద్దని కండీషన్ పెట్టాడు!

    బాహుబలి తర్వాత రాజమౌళి గ్రాఫిక్స్ లేని సినిమా చేయాలనుకుంటున్నాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.రాజమౌళి కోరిన విధంగా కథ అందించేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నాను అని ఆయన తెలిపారు.

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.... 'బాహుబలి' తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    సాధారణంగా కొందరు దర్శకులు హిట్టు పడగానే... ఆ వేడి తగ్గక ముందే వరుస సినిమాలు కమిట్మెంట్స్ తీసుకుంటారు. అయితే రాజమౌళి మాత్రం అలాంటోడు కాదు అంటున్నారు ఆయన తండ్రి, ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.

    ఇంకా కథ ఫైనల్ కాలేదు

    ఇంకా కథ ఫైనల్ కాలేదు

    రాజమౌళి నెక్ట్స్ సినిమా కోసం ఇంకా స్క్రిప్టు ఫైనల్ కాలేదని, ఇంకా ప్రయత్నాలు చేస్తామని విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు నచ్చిన కథ దొరికే వరకు రాజమౌళి అస్సలు కాంప్రమైజ్ కాడని ఆయన అన్నారు.

    పరుగెత్తి పాలుతాగే రకం కాదు

    పరుగెత్తి పాలుతాగే రకం కాదు

    రాజమౌళి పరిగెత్తి పాలు తాగే రకం కాదు. సక్సెల్‌లో ఉన్నప్పుడే సినిమాలు తీయాలనుకోడని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తెలిపారు.

    చేయాలనిపించే కథ చెప్పమంటాడు

    చేయాలనిపించే కథ చెప్పమంటాడు

    హీరోలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి అస్సలు సినిమాలు చేయడు. తనకు ఒక కథ నచ్చిన తర్వాత దారికి ఏ హీరో సూటవుతాడు అనేది చూస్తాడు. నేను ఏదైనా కథ చెబితే నచ్చక పోతే వెంటనే చెప్పేస్తాడు. నాకు చేయాలనిపించే కథ చెప్పండి అంటలాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

    అవేమీ వద్దని కండీషన్లు పెట్టాడు

    అవేమీ వద్దని కండీషన్లు పెట్టాడు

    బాహుబలి లాంటి భారీ గ్రాఫికల్ వండర్ తర్వాత రాజమౌళి ఎలాంటి గ్రాఫిక్స్ లేని సినిమా చేయాలనుకుంటున్నాడట. సినిమాలో గ్రాఫిక్స్‌, సీజీ వర్క్‌ అవసరం లేదని కథ కావాలని నాకు కండీషన్ పెట్టాడు. అలాంటి కథను అందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

    విజయేంద్ర ప్రసాద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ష్

    విజయేంద్ర ప్రసాద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ష్

    ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... తాను కథ అందించిన ‘మణికర్ణిక' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని, అస్సాంలో ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఫైట్‌ చేసిన రచిత్‌ కుల్‌బౌహిత్‌ జీవితం ఆధారంగా కథ రాస్తున్నా. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ గోల్‌ వాల్కర్‌గారి బయోపిక్‌ రాస్తున్నాను. ‘నాయక్‌', ‘రౌడీ రాథోడ్‌' అనే హిందీ సినిమాలకు సీక్వెల్‌ రాస్తున్నాను'' అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

    English summary
    "After Baahubali, My son Rajamouli Wants a Film without VFX, I am trying to write such a story." Vijayendra Prasad said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X