Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరే డైరెక్టర్ కి రాదు...
డైరెక్టర్ రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు. మాస్ హీరోయిజంని హైట్స్ కి తీసుకుపోయి సంచలనాలు సృష్టించడంలో తనకి తానే సాటి అనిపించాడు. రాజమౌళిలా మాస్ పల్స్ పట్టడం మరెవరికీ రావట్లేదు. అందుకే ఏ స్టార్ డైరెక్టర్ శైలినైనా అవలీలగా అనుకరించే సినీ మేథావులు రాజమౌళి జోలికెళ్లట్లేదు. అంతెందుకు రాజమౌళి వద్ద శిష్యరికం చేసిన వారికి కూడా అతని గుణగణాలు అబ్బడం లేదు. అందుకే రాజమౌళి శిష్యగణమంతా కట్టగట్టుకుని ప్లాపయ్యారు. ఇక రాజమౌళి సినిమాలని రీమేక్ చేయడం కూడా అషామాషి వ్యవహారం కాదు. ఇది గతంలోనే చాలా సార్లు రుజువయింది.
తాజాగా కన్నడంలో తుషార్ రంగనాథ్ దర్శకత్వంలో దునియా విజయ్ హీరోగా వచ్చిన 'కంఠీరవ" అనే సినిమాతో అది మరింత స్పష్టంగా తెలిసిపోయింది. జూ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి"సినిమాకి రీమేక్ అయిన ఈ చిత్రం ఘోరంగా ప్లాపయింది. రాజమౌళి స్ర్కీన్ ప్లేని యథాతథంగా కాపీ కొట్టినా కానీ కన్నడ దర్శకుడికి రాజమౌళి మ్యాజిక్ చేయడం చేతకాలేదు. దాంతో కంఠీరవ అత్యంత ఘోరంగా మట్టి కరిచాడు. ఇకపై రాజమౌళి సినిమాల్ని రీమేక్ చేయాలనుకునేవారికి 'తస్మాత్ జాగ్రత్త" అంటూ హెచ్చరికలు పంపాడు....