Just In
- 3 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్పోజింగ్తో చంపేసిందిగా..
Don't Miss!
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్సెట్ మార్చుకున్న రిషభ్!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అప్పుడే... : 'లింగ' సీడీలు పైరసీ పట్టుకున్నారు
వినుకొండటౌన్ : రిలీజయ్యి..నిండా ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడే పైరసీ భూతం మింగేసే ప్రయత్నం చేసింది. రజనీకాంత్ తాజా చిత్రం లింగా నిన్న ప్రపంచవ్యాప్యంగా అట్టహాసంగా విడుదలైంది. పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని జాగ్రత్రలు తీసుకున్నా ఈ లోగా ఈ చిత్రం పైరసీ వచ్చి అందరినీ షాక్ కు గురించి చేసింది. గుంటూరు జిల్లాలో పోలీసులు చేసిన మెరుపు దాడిలో లింగా చిత్రానికి సంభందించిన మూడు వేల సీడిలు దొరికాయి.

సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరుజిల్లా వినుకొండ కేంద్రంగా కొత్తసినిమాల పైరసీ సీడీలను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు గృహాల్లో ఆధు నాతన సాంకేతిక పరికరాలతో సినిమా రిలీజ్ అయిన రోజునే సీడీలను తయారుచేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు 40 వేల పైరసీ సీడీలు, 22 మానిటరింగ్ సీపీయూలు పట్టుపడ్డాయి. పట్టుపడ్డ సీడీల్లో శుక్రవారం విడుదలైన రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాకు సంబంధించిన 3 వేల సీడీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా వినుకొండకు చెందిన కొలిశెట్టి వెంకటరామాంజనేయులును అదుపులోకి తీసుకొన్నారు.