Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అప్పుడే... : 'లింగ' సీడీలు పైరసీ పట్టుకున్నారు
వినుకొండటౌన్ : రిలీజయ్యి..నిండా ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడే పైరసీ భూతం మింగేసే ప్రయత్నం చేసింది. రజనీకాంత్ తాజా చిత్రం లింగా నిన్న ప్రపంచవ్యాప్యంగా అట్టహాసంగా విడుదలైంది. పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని జాగ్రత్రలు తీసుకున్నా ఈ లోగా ఈ చిత్రం పైరసీ వచ్చి అందరినీ షాక్ కు గురించి చేసింది. గుంటూరు జిల్లాలో పోలీసులు చేసిన మెరుపు దాడిలో లింగా చిత్రానికి సంభందించిన మూడు వేల సీడిలు దొరికాయి.
సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరుజిల్లా వినుకొండ కేంద్రంగా కొత్తసినిమాల పైరసీ సీడీలను తయారు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు గృహాల్లో ఆధు నాతన సాంకేతిక పరికరాలతో సినిమా రిలీజ్ అయిన రోజునే సీడీలను తయారుచేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు 40 వేల పైరసీ సీడీలు, 22 మానిటరింగ్ సీపీయూలు పట్టుపడ్డాయి. పట్టుపడ్డ సీడీల్లో శుక్రవారం విడుదలైన రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాకు సంబంధించిన 3 వేల సీడీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా వినుకొండకు చెందిన కొలిశెట్టి వెంకటరామాంజనేయులును అదుపులోకి తీసుకొన్నారు.