Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ సినిమాను కాపీ కొట్టలేదు.. మా పోస్టర్ ఒరిజినల్.. సాక్ష్యాలున్నాయి
నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా తమిళ్ హీరో ఆర్య ప్రత్యేక పాత్రలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న డిఫరెంట్ మూవీ 'రాజరథం'. ఇటీవల ఈ చిత్రంలోని ఆర్య ఫస్ట్లుక్ పోస్టర్ను రాజరథం..
నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా తమిళ్ హీరో ఆర్య ప్రత్యేక పాత్రలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న డిఫరెంట్ మూవీ 'రాజరథం'. 'రంగితరంగ' వంటి సూపర్హిట్ చిత్రాన్ని రూపొందించిన అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ టీమ్ అజయ్ రెడ్డి గొల్లపల్లి, అంజు వల్లభనేని, విషు దకప్పదారి, సతీష్ శాస్త్రి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ఆర్య ఫస్ట్లుక్ పోస్టర్ను రాజరథం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
కాపీ చేయలేదు..
అయితే ఈ పోస్టర్ డిజైన్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రం నుంచి కాపీ చేయబడిందని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై 'రాజరథం' యూనిట్ సభ్యులు స్పందిచారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు అని తెలిపారు.
పవన్ కల్యాణ్ సినిమాలో
పవన్ కల్యాణ్ సినిమాలో నుంచి పోస్టర్ కాపీ చేశామనే వార్త ఎలా, ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. మేం అక్టోబర్ 12న ఈ పోస్టర్ను విడుదల చేశాం. మీడియాలో వచ్చిన న్యూస్లో 17న 'రాజరథం' పోస్టర్ వచ్చినట్టు పేర్కొన్నారు. కానీ, అది నిజం కాదు. ఎందుకంటే ఆ పోస్టర్లోని స్టిల్ను సెప్టెంబర్లోనే తియ్యడం జరిగింది.
బాలీవుడ్ కెమెరామెన్ మనీష్ ఠాకూర్
మా టీమ్కి టెక్నికల్గా వున్న బలంతోనే క్రియేట్ చేసిన వర్క్ అది. మాకు తెలిసి వేరొకరి క్రియేటివిటీని మేం ఎక్కడా కాపీ చెయ్యలేదు. మేం రిలీజ్ చేసిన పోస్టర్ వెనుక ఎంతో మంది కష్టం, ఎంతో ప్లానింగ్ వుంది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ బోర్డ్ రెడీ చెయ్యడం జరిగింది. మేం ఈ చిత్ర పోస్టర్ స్టిల్స్ కోసం హ్యాసల్బ్లాడ్ కెమెరాను వాడాం. ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ మనీష్ ఠాకూర్ ఈ ఫోటోలను తీశారు అని చెప్పారు.
అన్ని రకాల జాగ్రత్తలు
పోస్టర్ డిజైనింగ్కు సంబంధించిన వీడియో కూడా మా దగ్గర వుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త తరహా అనుభూతిని కలిగించేందుకు మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా దర్శకుడు అనూప్ భండారి, మా డిజైన్ టీమ్ 'కాని స్టూడియో' ఈ పోస్టర్ను మా తొలి తెలుగు చిత్రం 'రాజరథం' కోసం క్రియేట్ చేశారు.
పవన్కళ్యాణ్ ఎంతో గౌరవం
మాకు పవన్కళ్యాణ్ ఎంతో గౌరవం వుంది. వారిని, వారి టీమ్ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం రిలీజ్ చేసిన పోస్టర్ కాపీ చేసింది కాదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అని రాజరథం టీమ్ పేర్కొన్నారు.