twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజశేఖర్ 'ఆచూకీ'

    By Staff
    |

    డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడుగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సూర్యకిరణ్ దర్శకత్వం వహించనున్నారు.'ఏ-1' ప్రొడక్షన్స్ పతాకంపై కట్టా రాంబాబు నిర్మాణ నిర్వహణలో అతాఉల్లా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'నా స్టైల్ వేరు' చిత్రం తర్వాత రాజశేఖర్ నటించనున్న చిత్రం ఇదే అవుతుంది. సూర్యకిరణ్ దర్శకత్వంలో రాజశేఖర్ పనిచేయడం కూడా ఇదే మొదటిసారి.

    సూర్యకిరణ్ దర్శకుడుగా 'సత్యం'తో తొలి హిట్ సాధించి ఆ తర్వాత కొద్దికాలంగా సరైన సక్సెస్ లు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జగపతిబాబు 'బ్రహ్మాస్త్రం', మంచు మనోజ్ 'రాజుభాయ్' చిత్రాలకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ పట్టుదలగా రాజశేఖర్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఆదివారంనాడు సూర్యకిరణ్ బర్త్ డే హైద్రాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో సూర్యకిరణ్ సతీమణి కల్యాణితో పాటు రాజశేఖర్ దంపతులు, కట్టా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తో నిర్మించనున్న కొత్త చిత్రం వివరాలను కట్టా రాంబాబు ప్రకటించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ కు జోడిగా ముగ్గురు కథానాయికలు ఉంటారనీ, దీనికి 'ఆచూకీ' అనే టైటిల్ ను అనుకుంటున్నామనీ తెలిపారు. నటీనటులు, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ, అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X