Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
చిరుపై రాజశేఖర్ డైలాగ్ గొడవ
ఈ డైలాగ్ ను వెంటన చిత్రం నుంచి తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ చిరంజీవి, రాజశేఖర్ మధ్య మరో కొత్త వివాదానికి ఈ డైలాగ్ తెర తీస్తుందేమోనన్న అనుమానాలు సినీ పరిశ్రమ వర్గాలలో వ్యక్తం అయింది.'సత్యమేవ జయతే' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జరుగుతున్న ఆందోళన గురించి వార్తలు వెలువడిన వెంటనే దీనిపై ఛానెల్స్ వారు చర్చాగోష్టిలు నిర్వహించారు. ఈ వివాదంపై రాజశేఖర్ తో వారు మాట్లాడించారు. దాంతో ఓ చానల్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ డైలాగ్ ఎంతమాత్రం చిరంజీవిని ఉద్దేశించి పెట్టింది కాదని స్పష్టం చేశారు. అలా అంటూనే ఒకరి పేరు చెప్పుకుని ప్రజలలోకి వెళ్ళడం సబబు కాదని చిరంజీవిపై పరోక్షంగా మరోసారి వ్యంగ్య బాణం విసిరారు.
ఇక మథర్ థెరిస్సా ఆదర్శంతోనే తాను ప్రజా సేవలోకి అడుగుపెడుతున్నట్లుగా ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం కార్యాలయంలో సైతం 'మథర్' చిత్రం ప్రముఖంగా కనిపిస్తుంటుంది.అలాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత స్వయంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.