twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుపై చల్లారని రాజశేఖర్

    By Staff
    |

    Rajasekhar
    చిరంజీవి అభిమానులు హీరో రాజశేఖర్, జీవితలపై గుంటూరు, హైదరాబాద్ లలో దాడి చేయటం అది పెద్ద ఇష్యూ కావటం అందరికీ తెలిసిందే. ఆ దుస్సంఘటన మరవక ముందే అటువంటి పరిస్ధితి పునరావృతం అయ్యేటట్లు కనపడుతోంది. రెండు రోజుల క్రితం (ఏప్రిల్ 19) హీరో రాజశేఖర్ సెల్‌ఫోన్‌కు ఓ బూతు ఎస్ఎంఎస్‌ వచ్చింది. చాలా ఘోరమైన నీచమైన పదజాలంతో అది ఉందిట. దాంతో ఆగ్రహించిన రాజశేఖర్ అదే రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దానిపై ఫిర్యాదు చేశారు.

    పోలీసుల దర్యాప్తులో ఆ ఎస్ఎంఎస్ సూర్యాపేట ప్రాంతం నుంచి వచ్చినట్లు తేలింది. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ సెల్‌ఫోన్ ఆధారంగా ఒక యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతను చిరంజీవి వీరాభమాని. దాంతో అతణ్ణి అరెష్టు చేసి హైదరాబాద్‌కు తీసుకు వస్తున్నారు. ఎందుకిలా చేసావని సూర్యాపేట పోలీసులు అతన్ని వారి భాషలో అడిగితే ఆ కుర్రాడు కంగారు పడ్డాడు. ఆ ఎస్ఎంఎస్‌ను సరదాగా తన ఫ్రెండ్ కి పంపాననీ, అయితే నెంబర్ పొరబాటుగా నొక్కడంతో అది రాజశేఖర్‌కు వెళ్లి వుండవచ్చుననీ అంటున్నాడు.

    తాను ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదనీ మొత్తుకుంటున్నాడట. ఈ గొడవ ఎలా ఉన్నా చిరంజీవి రెపో మాపో పార్టీ పెడతారని ఆశిస్తున్న ఈ పరిస్ధితుల్లో మళ్ళీ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఈ తరహా సంఘటనలు జరిగి నెగిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుందంటున్నారు పరిశీలకులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X