Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ హీరోకు బావ కాబోతున్న రాజశేఖర్.. చెల్లెలు కాజల్ అట..
టాలీవుడ్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో విక్టరీ వెంకటేష్ది విలక్షణమైన శైలి. గురు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత ఓ మంచి కథతో దర్శకుడు తేజతో జతకట్టనున్నారు. గరుడ వేగతో సక్సెస్ను అందుకొన్న రాజశ
టాలీవుడ్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో విక్టరీ వెంకటేష్ది విలక్షణమైన శైలి. గురు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత ఓ మంచి కథతో దర్శకుడు తేజతో జతకట్టనున్నారు. ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్నది. అంతేకాకుండా ఈ చిత్రంలో గరుడ వేగతో సక్సెస్ను అందుకొన్న రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కలిసి నటించనున్నారనేది ఫిలీంనగర్ తాజా సమాచారం.
Recommended Video
ప్రచారంలో సినిమా పేరు
వెంకటేష్, తేజ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం పేరు ఆట నాదే.. వేట నాదే అనే ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమా గతనెలలోనే ప్రారంభించాలని అనుకొన్నారు. కానీ స్క్రిప్టు వర్క్ పూర్తి కాకపోవడంతో అది సాధ్యపడలేదట. త్వరలోనే బౌండ్ స్క్రిప్ట్ను రెడీ చేసి సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.
వెంకటేష్ పుట్టిన రోజున
వెంకటేష్ పుట్టిన రోజు డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని ప్రారంభించే ఆలోచనలో తేజ ఉన్నట్టు తెలుస్తున్నది. వరుసగా మూడు నెలలు షూట్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో తేజ ముందుకెళ్తున్నారట. బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
లెక్చరర్ పాత్రలో వెంకీ
ఇక వెంకటేష్ ఈ చిత్రంలో మరోసారి లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారట. సుందరకాండ చిత్రం తర్వాత మళ్లీ లెక్చరర్ పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక పూర్తి కాకపోయినప్పటికీ.. కాజల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
వెంకీకి బావగా రాజశేఖర్
ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గరుడ వేగతో మంచి ఊపు మీద ఉన్న రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్త మీడియాలో ప్రచారమవుతున్నది. ఈ చిత్రంలో రాజశేఖర్ బావగా నటిస్తున్నారనేది తాజా సమాచారం. వెంకటేష్తో నటించేందుకు రాజశేఖర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాలు వెల్లడించాయి.
మరో మల్టీస్టారర్ సినిమా
ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరో ఎవరంటే వెంకటేష్ మాత్రమే. రాజశేఖర్తో కలిసి మరో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గురు సినిమా తర్వాత డిఫెరెంట్ కథ కోసం వెయిట్ చేసిన వెంకటేష్ చివరికి తేజ చెప్పిన కథకు వెంకటేష్ బాగా ఇంప్రెసె అయ్యారనేది లేటేస్ట్ న్యూస్.