చిరంజీవి అబిమానులకీ రాజశేఖర్ ల మధ్యే మరోసారి వివాదం మొదలైంది. ఈ విషయమై రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. హెచ్ఐవీ/ఎయిడ్స్పై తాను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తుంటే చిరంజీవి అభిమానులు కొన్నిచోట్ల పోస్టర్లను తొలగిస్తున్నారని, అభిమానం అనేది కొంత వరకు మాత్రమే ఉండాలని హీరో రాజశేఖర్ అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బెంజిసర్కిల్ వద్ద ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జీవిత, రాజశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో తన ఫొటోతో పోస్టర్లు అంటించారని, వాటిని చిరంజీవి అభిమానులు చించివేస్తున్నారని చెప్పారు.