కామిడీగా రాజశేఖర్ ....

ఇక ఈ ప్రాజెక్టుకు నిర్మాత గా మాగంటి గోపీనాథ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం తన సహచరి జీవిత దర్శకత్వంలో 'ఖాఖి' రీమేక్ 'సత్యమేవ జయతే' చేస్తున్న రాజశేఖర్ ఈ సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో సుహాసి లీడింగ్ రోల్ చేస్తుంది. మొదట కాజల్ ని అడిగారట కానీ ఆమె బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారుట.
ఇక కథప్రకారం బధ్దకస్తుడైన..తాగుబోతు లాయర్ గా రాజశేఖర్ కామిడీ పండిస్తాడు. అతనికి వచ్చిన ఒక మిస్టీరియస్ కాల్ అతని జీవిత గమనాన్ని మారుస్తుంది. ఇక ఈ చిత్రానికి రమణగోగుల సంగీతం అందించటానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టులో పూజ కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ 'గేమ్' సినిమా తర్వాత పూర్తి ఖాళీగా ఉన్నారు. గత కొంత కాలంగా ఈ స్క్రిప్టు స్టోరీ సిట్టింగ్స్ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుంతం రాజశేఖర్ నటించిన 'గోరింటాకు' రిలీజుకు రెడీ అవుతోంది. అదీ ఒక కన్నడ రీమేక్ కావటం విశేషం.


Click it and Unblock the Notifications











