Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నట్టి కుమార్ నిర్మాతగా... డాక్టర్ రాజశేఖర్
వరసగా ఆగిపోయిన సినిమాలను తీసుకుని రిలీజ్ చేస్తున్న నట్టికుమార్ నిర్మాతగా రాజశేఖర్ ఓ చిత్రం చేస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 5న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతుంది. శ్రీహరి తో చేసిన 'దాసన్నా' చిత్రం తర్వాత తను నిర్మించే మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇదనీ, ఈ సినిమా కూడా తమ సంస్థ ప్రతిష్టను పెంచుతుందనే నమ్మకం ఉందని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. అలాగే 'గోరింటాకు' చిత్రం తర్వాత డా.రాజశేఖర్ ఈ సినిమాలో మరో ఉదాత్తమైన పాత్రను పోషిస్తున్నారనీ, ఏడుగురు తమ్ములకు అన్నగా ఆయన పాత్ర ఎంతో హుందాగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తారని, వారి వివరాలను చిత్రం ప్రారంభోత్సవం రోజున వెల్లడిస్తామని నట్టి కుమార్ చెప్పారు. చిత్ర నిర్మాణంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తామని, పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన స్క్రిప్ట్ అందించారని ఆయన తెలిపారు.