Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్ళికి ముందు రాజశేఖర్ ఓ అమ్మాయితో...
అందరిలాగే రాజశేఖర్ కీ కాలేజ్ రోజుల్లో ఓ ప్రేమ కథ ఉంది. ఆ విషయాలను ఈ మధ్యన ఆయన గుర్తు చేసుకున్నారు.. అవి నేను కాలేజీ చదువుతున్న రోజులు. నాకంటే ఐదేళ్లు చిన్నదైన ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను. ఆమె ఒప్పుకోక రిజెక్టు చేసింది. దాంతో విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నా పరిస్ధితి చూసిన ప్రెండ్స్ కొంత మంది మానసికంగా నేను బలపడటానికి భగవంతుడును ఆశ్రయించమన్నారు. అంతవరకూ నాకు ఆ విశ్వాసాల మీద నమ్మకం లేదు. అలాంటిది తొలిసారి గుడిలోకి అడుగుపెట్టాను. చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న శివాలయానికి వెళ్లాను. నువ్వంటూ నిజంగా ఉంటే ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించేలా చేయాలి అని శివుడ్ని కోరుకున్నాను. ఆశ్చర్యంగా రెండు నెలల తర్వాత ఆమె నా ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది' అంటూ నవ్వుతూ చెప్పారాయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే...ఆ అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోలేదు. అయితే ఆ చెప్పలేదు. అయితే ఆ వివాహం ఎందుకు ఆగిందో చెప్పలేదు. కానీ ఆ తర్వాత జీవిత కలవటం..ఆ బంధం వివాహానికి దారితీయటం జరిగింది. అప్పుడు ఏర్పడిన శైవ భక్తితోనే తన పిల్లలకు శివానీ, శివాత్మిక అనే పేర్లు పెట్టుకున్నారు.