Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూ.100 పుచ్చుకుని.. సైరా రివ్యూ రాయలేదా?.. ప్రముఖ రివ్యూ రైటర్పై సెటైర్లు
మన దక్షిణాది సినిమాలన్నా, ఇక్కడివారన్నా ఉత్తరాది వారికి అంతగా పడదు. అయితే ఇక్కడి కథలను మాత్రం ఎత్తుకుపోయి అక్కడ సొమ్ము చేసుకుంటారు. అందులో మాత్రం ఏమీ మొహమాట పడరు. కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి.. ఏదైనా సాధిస్తే మాత్రం ఒప్పుకోరు. ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.
ఇక్కడి అర్జున్ రెడ్డి.. అక్కడ కబీర్ సింగ్
అర్జున్ రెడ్డి సినిమా ఇక్కడ ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కూడా వివాదాలు చుట్టుముట్టాయి. వాటితో పాటే సినిమా కూడా జనాల్లోకి చొచ్చుకుపోయింది. అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన సందీప్ రెడ్డి.. హిందీలో కబీర్ సింగ్ను రీమేక్ చేశాడు.
మీడియా చిన్నచూపు..
అయితే ఓ తెలుగు డైరెక్టర్ బాలీవుడ్కు వెళ్లి అంత క్రేజ్ సంపాదించుకోవడం.. సినిమా అంత పెద్ద హిట్ కావడం కొందరికి నచ్చలేదు. మీడియా సమావేశంలో కూడా సందీప్ను చిన్నచూపు చూడటం.. ప్రశ్నలు అడక్కపోవడం.. అడిగినా సమాధానాలు చెప్పేవరకు ఆగకపోవడం.. ఇలా అన్నింటిలో నిర్లక్ష్యం చూపేవారు.
కబీర్ సింగ్పై లెక్కలేనన్ని విమర్శలు..
కబీర్ సింగ్ పాత్రపై, చిత్రీకరణపై బాలీవుడ్లోని ఓ వర్గం మీడియా కావాలనే పనిగట్టుకుని దుమ్మెత్తిపోసింది. హీరో మోటుసరసం, పట్టి లాగడం లాంటి విషయాలను సైతం బూతద్దంలో పెట్టి.. సినిమాపై నెగిటివిటీ ప్రచారం చేశారు. కానీ వారి ఎత్తులేవీ పనిచేయలేదు. తిరుగు లేని కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది.
తాజాగా సైరాపై..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాను బాలీవుడ్ మీడియా చిన్నచూపు చూసింది. కనీసం సినిమా గురించి ఎక్కడా కూడా వినిపించకుండా చేసింది. సినిమాకు సంబంధించిన వార్తలు, రివ్యూలు, కలెక్షన్లు ఇలా ఏ ఒక్కటి కూడా రాయడం లేదు. అయితే వీటిపై చిర్రెత్తిన ఓ అభిమాని.. ప్రముఖ రివ్యూ రైటర్లను ఘాటుగా ప్రశ్నించాడు. రివ్యూ రాయకుండా ఉండేందుకు ఎంత తీసుకున్నావ్ అంటూ రాజీవ్ మసాంద్, తరణ్ ఆదర్శ్, అనుపమచోప్రాఅను ప్రశ్నించాడు.
200రూపాలయలంటూ రిప్లై...
అయితే అభిమాని అడిగిన ప్రశ్నకు రాజీవ్ మసాంద్ స్పందిస్తూ.. రెండు వందల రూపాయలంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇది కామెడీగా ఇచ్చాడో.. సీరియస్గా ఇచ్చాడో కానీ రచ్చ మొదలైంది. అయితే ఆయన ఇచ్చిన రిప్లైను చూపిస్తూ.. ఎవరైనా షాట్ ఫిల్మ్స్ తీసుంటే.. అతనికి చూపించండి మరీ తక్కువలో రివ్యూ చెబుతాడు అంటూ కామెంట్ చేశాడు.
Recommended Video
సీరియస్ అయిన రివ్యూ రైటర్..
ఈ 200 రూపాయల ట్వీట్ను చిరంజీవి ఫ్యాన్స్ పేజి నడుపుతున్న ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. వంద రూపాయలు వార్ రివ్యూ రాయడానికి, వంద రూపాయలు సైరా రివ్యూ రాయకుండా ఉండడానికి అంటూ సెటైరికల్గా కామెంట్ పెట్టాడు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. సార్.. వార్ సినిమాకు నేను ఇచ్చిన రివ్యూ చూసి మాట్లాడండి అంటూ ఒకింత అసహనానికి గురైనట్టు కనిపిస్తోంది.