twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ శృతిమించుతోంది: రాజేంద్ర ప్రసాద్

    By Bojja Kumar
    |

    ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ గతి తప్పుతోందని, కొందరు వాడుతున్న డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగా కామెడీ సీన్లు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండటం లేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ విమర్శలపై ప్రముఖ నటుడు, ఒకప్పుడు కామెడీ హీరోగా తెలుగులో హిట్ చిత్రాలు చేసి ప్రేక్షకలను అలరించిన రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇప్పుడు కామెడీ శ్రుతిమించిందని, దారి మళ్లిందని తెలిపారు.

    Rajendra Prasad about bad comedy in Telugu Movies

    ప్రశాంతత కోసం గోవిందమాల ధరించిన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం వెలుపల మీడియాతో మాట్లాడారు. నేను జంధ్యాల, బాపు, రేలంగి వంటి పెద్ద దర్శకులతో హాస్య కథానాయకుడిగా నటించానని గుర్తుచేసుకున్నారు.

    తాను తన కెరీర్లో ఎంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేశానన్నారు. అలాంటి సినిమాలను ఇప్పటికీ కుటుంబ సమేతంగా చూస్తున్నారని.. అందులో సంసారపక్షమైన హాస్యం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దారితప్పుతున్న కామెడీలో మార్పులు తీసుకురావాలని మా వాళ్లను రిక్వస్ట్‌ చేస్తున్నా. అందరిలోనే మార్పు రావాలని దేవుడి సమక్షంలో కోరుకుంటున్నా' అని తెలిపారు.

    English summary
    Popular actor Rajendra Prasad said that the comedy in the Telugu movies going wrong. He said the change was necessary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X