Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ శృతిమించుతోంది: రాజేంద్ర ప్రసాద్
ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ గతి తప్పుతోందని, కొందరు వాడుతున్న డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగా కామెడీ సీన్లు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండటం లేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విమర్శలపై ప్రముఖ నటుడు, ఒకప్పుడు కామెడీ హీరోగా తెలుగులో హిట్ చిత్రాలు చేసి ప్రేక్షకలను అలరించిన రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇప్పుడు కామెడీ శ్రుతిమించిందని, దారి మళ్లిందని తెలిపారు.
ప్రశాంతత కోసం గోవిందమాల ధరించిన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం వెలుపల మీడియాతో మాట్లాడారు. నేను జంధ్యాల, బాపు, రేలంగి వంటి పెద్ద దర్శకులతో హాస్య కథానాయకుడిగా నటించానని గుర్తుచేసుకున్నారు.
తాను తన కెరీర్లో ఎంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేశానన్నారు. అలాంటి సినిమాలను ఇప్పటికీ కుటుంబ సమేతంగా చూస్తున్నారని.. అందులో సంసారపక్షమైన హాస్యం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దారితప్పుతున్న కామెడీలో మార్పులు తీసుకురావాలని మా వాళ్లను రిక్వస్ట్ చేస్తున్నా. అందరిలోనే మార్పు రావాలని దేవుడి సమక్షంలో కోరుకుంటున్నా' అని తెలిపారు.