Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ శృతిమించుతోంది: రాజేంద్ర ప్రసాద్
ఇప్పటి సినిమాల్లో, టీవీ షోల్లో కామెడీ గతి తప్పుతోందని, కొందరు వాడుతున్న డబుల్ మీనింగ్ డైలాగుల కారణంగా కామెడీ సీన్లు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండటం లేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విమర్శలపై ప్రముఖ నటుడు, ఒకప్పుడు కామెడీ హీరోగా తెలుగులో హిట్ చిత్రాలు చేసి ప్రేక్షకలను అలరించిన రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇప్పుడు కామెడీ శ్రుతిమించిందని, దారి మళ్లిందని తెలిపారు.
ప్రశాంతత కోసం గోవిందమాల ధరించిన ఆయన శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. దర్శనం అనంతరం వెలుపల మీడియాతో మాట్లాడారు. నేను జంధ్యాల, బాపు, రేలంగి వంటి పెద్ద దర్శకులతో హాస్య కథానాయకుడిగా నటించానని గుర్తుచేసుకున్నారు.
తాను తన కెరీర్లో ఎంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేశానన్నారు. అలాంటి సినిమాలను ఇప్పటికీ కుటుంబ సమేతంగా చూస్తున్నారని.. అందులో సంసారపక్షమైన హాస్యం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దారితప్పుతున్న కామెడీలో మార్పులు తీసుకురావాలని మా వాళ్లను రిక్వస్ట్ చేస్తున్నా. అందరిలోనే మార్పు రావాలని దేవుడి సమక్షంలో కోరుకుంటున్నా' అని తెలిపారు.